త్వరగా తెచ్చేయండి... లేకపోతే లావైపోతారు: విజయసాయి రెడ్డికి బుద్ధా కౌంటర్

  • మీరు కోరుకున్నవన్నీ ప్రజలు ఇచ్చారు
  • ప్రజలు కోరుకున్న హోదా మాటేమిటి?
  • ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్నవన్నీ ప్రజలు ఇచ్చారని, కానీ ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదాను ప్రభుత్వం ఎప్పుడు తెస్తుందని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఒకటి నుండి మొదలైన వైకాపా రాజ్యసభ ప్రస్థానం 11కి చేరుతుంది అని ఎంపీ విజయసాయి రెడ్డి సెలవిచ్చారు. మీరు కోరుకున్న ప్రతిదీ ప్రజలు మీకిచ్చారు అని చెబుతున్నారు సరే, మరి  ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదా మాటేమిటి? త్వరగా తెచ్చేయండి. లేకపోతే లావైపోతారు!!" అని అన్నారు.

Budda Venkanna
Vijay Sai Reddy
Twitter

More Telugu News